రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్వర్మ
ములుగు జిల్లా పర్యటన లో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
- By RajuLoading...
- | 27 Aug 2024 12:53 PM GMT
X
ములుగు జిల్లా పర్యటన లో భాగంగా గవర్నర్ జిష్ణుదేవ్వర్మ రామప్ప రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు.దేవాలయ ప్రాంగణంలో గవర్నర్ పోలీసుల గౌరవ వందన స్వీకరించారు. గవర్నర్కు ఆలయ వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. రాష్ట్ర గవర్నర్ రుద్రేశ్వరుడినీ దర్శించుకుని గవర్నర్ ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు గవర్నర్ ను పట్టు వస్త్రాల తో సత్కరించి , ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అందించారు.
గవర్నర్ తో కలిసి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న వారిలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం శాసనసభ సభ్యుడు తెల్లం వెంకటరావు , భూపాలపల్లి శాసనసభ సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు , గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వెంకటేశం, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ శబరీష్ లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ ఏటూరు నాగారం పిఓ చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహుల్ కిషన్ జాదవ్, ఆర్డీఓ సత్య పాల్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.