ఏపీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల ప్రమాణం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బుచ్చయ్య చౌదరితో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.

AP Proten Spekar
X

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ రాజ్‌భవన్‌లో గోరంట్లతో ప్రమాణం చేయించారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎల్లుండి నుంచి రెండురోజుల పాటు ప్రొటెం స్పీకర్‌గా 174 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

సీఎం చంద్రబాబు గోరంట్లకు ఈ అవకాశం కల్పించారు. ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. తొలుత సీఎం చంద్రబాబు, అనంతరం డిప్యూటీ సీఎంలు ప్రమాణం చేయనున్నారు. సాధారణ సభ్యుడిగానే వైసీపీ అధినేత జగన్ ప్రమాణం చేయనున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ సభ్యుడిగానే జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆంగ్ల అక్షరాల ప్రాతిపదిక వరుస క్రమంలో ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story