అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ జీహెచ్ఎంసీ మేయర్ ఫిర్యాదు

తనను కించపరిచేలా సోషల్ మీడియాలో అసభ్యకర పెడుతున్నారంటూ హైదారబాద్‌ జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

meyar
X

సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వీడియోలు పోస్ట్ చేశారని హైదారబాద్‌ జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే విధంగా వీడియోలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు, తనను ట్రోల్స్ చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఈ మేరకు ఎక్కడెక్కడ వీడియోలు పోస్ట్ చేశారో అన్న వివరాలతో ఆమె పోలీసులకు దృష్టికి తీసుకువెళ్లారు. అసభ్యకర వీడియోలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు.

మేయర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తామని తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇబ్బందికి గురయిన విషయం తెలిసిందే. కాగా ప్రోటోకాల్ పాటించలేదంటూ మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి అలిగారని, నిరసన వ్యక్తం చేశారంటూ వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

Vamshi

Vamshi

Writer
    Next Story