తండ్రైన హీరో నితిన్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భార్య
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తండ్రి అయ్యాడు. ఆయన సతీమణి శాలిని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు.
- By VamshiLoading...
- | 6 Sept 2024 1:36 PM GMT
X
X
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తండ్రి అయ్యాడు. ఆయన భార్య శాలిని పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని నితిన్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మా ఫ్యామిలీలోకి కొత్త తారకు స్వాగతం అంటూ ఆయన చిన్నారి ఫోటోను పంచుకున్నారు. మేము తల్లిదండ్రులము అయ్యామని చెప్పడానికి సంతోషిస్తున్నాము. తల్లి, బిడ్డ ఇద్దరూ.. ఆరోగ్యంగా ఉన్నారు” అని ట్విట్ చేశాడు నితిన్.
దీంతో ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2020 జూలై 26న షాలినిని పెళ్లి చేసుకున్నాడు. ఇక నితిన్ జయం సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ చ్చిన విషయం తెలిసిందే. గతేడాది ‘ఎక్స్ట్రా: ఆర్డినరీ మ్యాన్’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన నితిన్ ప్రస్తుతం రెండు చిత్రలతో బిజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘తమ్ముడు’, వెంకీ కుడుముల డైరెక్షన్లో ‘రాబిన్హుడ్’ చిత్రాల్లో నటిస్తున్నారు.
Vamshi
Writer
Next Story