ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి

గోల్కొండ ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.తుపాన్ వాహనాన్ని వేగం వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.

Accident
X

హైదరాబాద్ ఓటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం పెద్ద గొల్కోండ వద్ద తుపాన్ వాహనాన్ని వేగం వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన, కాగా, తుక్కుగూడ నుంచి శంషాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Vamshi

Vamshi

Writer
    Next Story