రుణమాఫీపై రోడ్డెక్కిన రైతులు

రోజులు గడుస్తున్నా మాఫీ కాలేదని ప్రభుత్వంపై మండిపడుతున్న రైతులు

రుణమాఫీపై రోడ్డెక్కిన రైతులు
X

రుణమాఫీ కాలేదని రాష్ట్రవ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట కెనరా బ్యాంకు ముందు రైతులు ఆందోళన చేపట్టారు. రోజులు గడుస్తున్నా రుణమాఫీ కాలేదంటూ వేంపేట, చింతలపేట, ధర్మాసం, సాతారం, చిట్టాపూర్‌ గ్రామాల రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మహారాష్ట్ర బ్యాంకు వద్ద రైతులు ఆందోళన చేస్తున్నారు. రుణమాఫీ కాలేదని రైతులు బ్యాంకును ముట్టడించారు. రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రుణమాఫీపై మాట తప్పిన సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని నిజామాబాద్‌ జిల్లా ఆలూరు మండల కేంద్రంలో రైతులు రోడ్డెక్కారు. ఎలాంటి కండీషన్లు లేకుండా రూ. రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Raju

Raju

Writer
    Next Story