ఎసెన్షియా ఫార్మా కంపెనీని సీజ్ చేయాలి : షర్మిల

అచ్యుతాపురం ఘటనపై గత ఏడాడి చివరిలోనే 'ఎసెన్షియా ఫార్మా' నిర్వాహకాలను ఓ రిపోర్టు బయట పెట్టిందని, ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసిందని కాని అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు

Sharimila
X

అచ్యుతాపురం ఘటనపై గత ఏడాడి చివరిలోనే 'ఎసెన్షియా ఫార్మా' నిర్వాహకాలను ఓ రిపోర్టు బయట పెట్టిందని, ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేసిందని కాని అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నుండి ఏమి నేర్చుకోకుండా, ఎదురు ఈ రిపోర్టుపై మౌనం వహించిందని షర్మిల విమర్మించింది. పట్టుమని పాతిక కిలోమీటర్ల దూరంలో కొండను పిండి చేసి రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టుకోవడానికి డబ్బు, తీరిక ఉంటాయి.

కానీ కార్మికుల ప్రాణాలంటే మాత్రం లెక్క లేదని పేర్కొన్నాది. కూటమి సర్కారును మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఎసెన్షియా కంపెనీని సీజ్ చేసి చర్యలు తీసుకోవాలని. ఇటువంటి దారుణాలు, మరీ ముఖ్యంగా విశాఖ పరిసరాల్లో మరోసారి జరగకుండా ఆకస్మిక తనిఖీల ద్వారా నియంత్రణకు పూనుకోవాలి. ఎక్కడ భద్రతా పట్ల నిర్లక్ష్యం కనిపించినా వెంటనే ఆ ప్లాంట్లు మూసివేయాలని షర్మిల డిమాండ్ చేశారు

Vamshi

Vamshi

Writer
    Next Story