డీఎంకే ఎంపీకి రూ.908 కోట్ల జరిమానా
తమిళనాడు డీఎంకే ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త ఎస్. జగత్రక్షకన్కు ఆయన కుటుంబ సభ్యులకు ఈడీ రూ.908 కోట్ల జరిమాన విధించింది
- By VamshiLoading...
- | 28 Aug 2024 12:14 PM GMT
X
X
తమిళనాడు డీఎంకే ఎంపీ, ప్రముఖ వ్యాపారవేత్త ఎస్. జగత్రక్షకన్కు ఆయన కుటుంబ సభ్యులకు ఈడీ రూ.908 కోట్ల జరిమాన విధించింది. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో ఈ భారీ జారిమాన విధించినట్లు ఈడీ తెలిపింది. ఆగస్టు 26న తేదీన ఇచ్చిన తీర్పుతో ఈ చర్యలు తీసుకుంది. అలాగే ఫెమా చట్టంలోని 37ఏ సెక్షన్ ప్రకారం 2020 సెప్టెంబర్లో సీజ్ చేసిన రూ. 89.19 కోట్లను కూడా జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది. ఇదిలాఉంటే.. వ్యాపారవేత్త అయిన జగత్రక్షకన్ ప్రస్తుతం అరక్కోణం లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.
Vamshi
Writer
Next Story