విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
డిస్కంల పరిధిలో సాంకేతి పరిజ్ఞానం అమలు తీరుతో పాటు, విద్యుత్ సమస్యలు, తదిరత అంశాలపై విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్ష జరిపారు.
- By RajuLoading...
- | 8 Aug 2024 8:13 AM GMT
X
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ టీజీ ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. వర్షాల దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం దిశానిర్దేశం చేశారు.
డిస్కంల పరిధిలో సాంకేతి పరిజ్ఞానం అమలు తీరుతో పాటు, విద్యుత్ సమస్యలు, తదిరత అంశాలపై సమీక్ష జరిపారు.ఈ సమావేశానికి ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ సుల్తానియా, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ ఫరూఖీ ఇతర అధికారులు హాజరయ్యారు.
విద్యుత్ సమస్యల పరిష్కారానికి వ్యవస్థను ఏర్పాటు చేసిన ట్టు భట్టి విక్రమార్క తెలిపారు. కంట్రోల్ రూమ్ ఫిర్యాదులను స్వీకరించి సమస్యలను పరిష్కరిస్తుందన్నారు. వర్షాకాలం దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించాం. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదుగుతున్నదని, పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు ముందుకు వస్తున్నాయని భట్టి తెలిపారు. అలాగే పదోన్నతుల విషయంలో ఉద్యోగులతో చర్చించాలని ఆదేశించామన్నారు.