లద్దాఖ్లో ఐదు కొత్త జిల్లాల ఏర్పాటు
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- By RajuLoading...
- | 26 Aug 2024 8:58 AM GMT
X
X
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. కొత్త జిల్లాల పేర్లను జన్స్కర్, డ్రాస్, శామ్, సుబ్రా, చంగ్థంగ్గా పేర్కొన్నారు.అభివృద్ధి చెందిన సంపన్నమైన లద్ధాఖ్ను నిర్మించాలనే ప్రధాని నరేంద్రమోడీ విజన్లో భాగంగా ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ నిర్ణయంతో ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతాయని తెలిపారు. లద్దాక్ ప్రజలకు సమృద్ధిగా అవకాశాలు కల్పించడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని షా చెప్పారు.
Raju
Writer
Next Story