హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామా : కిషన్‌రెడ్డి

రాష్ట్రంలో హైడ్రాతో ప్రభుత్వం హైడ్రామా నడుపుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Kishan reddy
X

తెలంగాణలో హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రమా నడుపుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. గతంలో అక్రమ నిర్మాణలకు అనుమతులు ఇచ్చిన సర్కార్ ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని విమర్శలు గుప్పించారు.ఇన్నాళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించాయని అన్నారు. పాలకులు, అధికారులు కుమ్మకై అనుమతులు ఇచ్చారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అప్పుడు ఎలా అనుమతులు ఇచ్చారని, అక్రమ నిర్మాణాలకు రోడ్డు, విద్యుత్ సదుపాయము, నీటి సదుపాయం ఎలా కల్పించారని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలకు రోడ్లను నిర్మించి సదుపాయాలు ఎలా కల్పించారని ప్రశ్నించారు. ఇప్పుడు అవన్నీ కూడా లోతుగా చర్చించాల్సిందేనని అన్నారు. ఏ చర్యలైనా, చట్టమైనా అందరికీ సమానంగా వర్తింప చేయాలని, ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సరికాదని హితవు పలికారు. గతంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కిషన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story