మోడీ, అమిత్‌ షాలతో భేటీకానున్న సీఎం రేవంత్‌

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి నేడు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సి బకాయిలు విడుదల చేయాలని ప్రధానిని కోరనున్నారు.

మోడీ, అమిత్‌ షాలతో భేటీకానున్న సీఎం రేవంత్‌
X

ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి నేడు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా పాల్గొననున్నారు.మధ్యాహ్నం 1: 30 గంటలకు ప్రధానితో భేటీ అయ్యే అవకాశం ఉన్నది.

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రధాని తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి న్యాయం చేయాలని ప్రధాని కోరనున్నారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాలు ఈ సమావేశం జరిగింది. సీఎం వెంట అమిత్‌ షా వద్దకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్లారు. కేంద్ర హోంత్రి భేటీలో విభజనకు అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్‌ అంశాలతో పాటు రాష్ట్రానికి ఐపీఎస్‌ పోలీస్‌ అధికారుల కేటాయింపు విషయంలో గతంలోనే ప్రతిపాదనలు అందించారు. వాటికి అనుగుణంగా కేటాయింపులు జరపాలని కోరారు. విపత్తు నిర్వహణకు సంబంధించిన నిధులు, రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు.

మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై అధిష్ఠానంతో చర్చించడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లారు. ఈ అంశాలపై ఏకాభిప్రాయం కుదరకపోవడం విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Raju

Raju

Writer
    Next Story