ప్రధాని మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

ప్రధాని నరేంద్రమోదీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఉన్నారు.

Cm revanth reddy
X

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో బీజీ బీజీగా గడుపుతున్నారు. తాజాగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు వివిధ అంశాలపై ప్రధానికి వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రాజెక్టుల అంశంలో రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అనంతరం సీఎం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు. ఈ సమావేశం అనంతరం పలువురు కేంద్ర మంత్రులతో కూడా సీఎం రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు కూడా గురువారమే ప్రధాని, అమిత్‌షాలతో భేటీ అవుతున్నారు. విభజన సమస్యలపై ఇరురాష్ట్రాల సీఎంలు 6వ తేదీన హైదరాబాద్‌లో సమావేశం కావడానికి ముందు ఇద్దరూ దిల్లీలో ప్రధాని, హోంమంత్రులను కలవనుండటం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

Vamshi

Vamshi

Writer
    Next Story