నేడు ఢిల్లీకి మళ్లీ సీఎం రేవంత్రెడ్డి
నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెళ్లనున్నారు.
- By VamshiLoading...
- | 22 Aug 2024 5:14 AM GMT
X
X
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్రెడ్డి వెళ్లనున్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగే ఈ భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీ.. ఇతర ఏఐసీసీ పెద్దలూ పాల్గొననున్నట్లు సమాచారం. రాష్ట్రంలో పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక మంత్రివర్గ విస్తరణకు సంబంధి చర్చించే అవకాశం ఉంది. ఇటీవల సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడే ఈ అంశాలపై అధిష్ఠానంతో చర్చలు జరగాల్సి ఉంది.
అయితే, అప్పుడే మహారాష్ట్ర, హరియాణా ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడం, రాజ్యసభ ఎన్నికల్లో అభిషేక్ మను సింఘ్వి నామినేషన్కు ముందు ఇలాంటివి పెట్టుకోవద్దని అధిష్ఠానం భావించడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది.అయితే, ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ స్థానంలో ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ భగేల్ను నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Vamshi
Writer
Next Story