అమెరికా ఎయిర్ లైన్స్ కంపెనీలతో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణ లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం
- By RajuLoading...
- | 8 Aug 2024 5:58 AM GMT
X
X
అమెరికా పర్యాటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ఎయిర్లైన్స్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఐటీ కంపెనీల నిర్వాహకులతో పెట్టుబడులపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నది.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. ఎన్ఆర్ఐ సదస్సులో సీఎం మాట్లాడుతూ..పెట్టుబడులు పెట్టేవారికి అన్నిరకాల సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. వచ్చే పదేళ్ల లో తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇవాళ సాయంత్రం శాన్ఫ్రాన్సిస్కోకు చేరుకొని ఆపిల్ హెడ్ క్వార్టర్ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా పలు కంపెనీల సీఈవోలతో సీఎం బృందం భేటీ కానున్నది. డల్లాస్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు మహాత్మాగాంధీ మెమోరియల్ను సందర్శించారు.
Raju
Writer
Next Story