కేంద్ర మంత్రి సింధియాను కలిసిన సీఎం రేవంత్
టీ-ఫైబర్ ద్వారా తెలంగాణలోని 65వేల ప్రభుత్వ కార్యాలయాలకు జీ2జీ, జీ2సీ సేవలు అందించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
- By VamshiLoading...
- | 23 Aug 2024 2:35 PM GMT
X
కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాను సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క భేటీ అయ్యారు.టీ-ఫైబర్ ప్రాజెక్టును భారత్ నెట్ ఫేజ్-3 పథకంలో చేర్చాలని మంత్రిని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో 63లక్షల గృహాలకు, పట్టణ ప్రాంతాల్లో 30లక్షల ఇళ్లకు నెలకు కేవలం రూ.300కే ఇంటర్నెట్, కేబుల్ టీవీ, ఈ-ఎడ్యుకేషన్ సేవలు అందించాలని విజ్ఞప్తి చేశారు.
టీ-ఫైబర్ అమలుకు గానూ జాతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ (ఎన్ఎఫ్ఓఎన్) మొదటి దశ మౌలిక సదుపాయాలను తెలంగాణ ప్రభుత్వానికి త్వరగా అందించాలని సింధియాకు విన్నవించారు. ఎన్ఎఫ్ఓఎన్ మొదటి దశ నుంచి భారత్ నెట్ మూడో దశకు మార్చడానికి పంపించిన డీపీఆర్ను ఆమోదించాలని ముఖ్యమంత్రి కోరారు. భారత్ నెట్ ఉద్యమి ప్రోత్సాహక పథకాన్ని టీ-ఫైబర్కు వర్తింపజేయాలని విన్నవించారు. టీ-ఫైబర్ కోసం రూ.1,779కోట్ల మేర వడ్డీ లేని దీర్ఘకాలిక రుణాన్ని ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.