గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కలిసిన సీఎం రేవంత్‌

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు

గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ కలిసిన సీఎం రేవంత్‌
X

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ సీఎం రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వీరిద్దరు పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్ వర్మను కేంద్రం ప్రకటించగా రాధాకృష్ణన్ మహారాష్ణ్రకు బదిలీ అయ్యారు. జిష్ణుదేవ్ ఎల్లుండి గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు అపాయింట్ అయ్యారు. మరి కొందరికి స్థానచలనం కలిగింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలో కొందరు మాజీ కేంద్రమంత్రులు సైతం ఉన్నారు. తెలంగాణ గవర్నర్‌గా జిష్ణు దేవ్ వర్మ నియమితులయ్యారు. ఈయన బీజేపీ సీనియర్ నాయకుడు. సొంత రాష్ట్రం త్రిపుర. రెండుసార్లు మంత్రిగా, ఒకసారి ఉప ముఖ్యమంత్రిగా చేశారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించానున్నారు

Vamshi

Vamshi

Writer
    Next Story