సాయంత్రం సీఎల్పీ భేటీ

రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా అభిషేక్‌ సింఘ్వీ రేపు నామినేషన్‌

సాయంత్రం సీఎల్పీ భేటీ
X

ఇవాళ సాయంత్రం జరగనున్న కాంగ్రెస్‌ పార్టీ లెజిస్లేటివ్‌ సమావేశానికి కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ అభ్యర్థి అభిషేక్‌ సింఘ్వీ హాజరుకానున్నారు. హైదరాబాద్‌కు చేరుకున్న అభిషేక్‌కు శంషాబాద్‌ చేరుకున్న ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌ స్వాగతం పలికారు.

రాత్రి 7 గంటలకు జరగనున్న ఈసమావేశానికి పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షత వహిస్తారు. నానక్‌రామ్‌ గూడలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో ఈ సమావేశం జరగనున్నది. రాజ్యసభ ఎన్నికపై సీఎం నేతలతో చర్చించనున్నారు. సీఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉఎంపీలకు సింఘ్వీని పరిచయం చేయనున్నారు. సింఘ్వీకి మద్దతుగా సీఎల్పీలో ఏక వాక్య తీర్మానం చేయనున్నారు.ప్రభుత్వ నిర్ణయాలు, సంస్థాగత ఎన్నికలు,భవిష్యత్‌ కార్యాచరణ చర్చించే అవకాశం ఉన్నది.

వచ్చే నెల 3వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్‌ అధిష్ఠానం అభిషేక్‌ మను స్వింఘీని పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో రాజ్యసభ ఎంపీగా ఉన్న కే. కేశవరావు రాజీనామా చేయడంతో ఈ ఈ ఉప ఎన్నిక జరుగుతున్నది.

Raju

Raju

Writer
    Next Story