ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసిన చంద్రబాబు
- Byline VamshiLoading...
- | 13 Jun 2024 11:49 AM GMT
X
X
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ మేరకు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రూ. 4వేలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్దరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు చేశారు. అంతకుముందు ఆయన,సతీమణి భువనేశ్వరితో కలిసి సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
సచివాలయానికి వెళ్తున్న సమయంలో రాజధాని రైతులు, ఉద్యోగులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. సీఎం చాంబర్ లో చంద్రబాబుకు టీడీపీ అగ్రనేతలు, అధికారులు, విద్యార్థినులు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రాష్ట్ర సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కూడా శుభాకాంక్షలు తెలిపారు.
Vamshi
Writer
Next Story