ఖమ్మం వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటన

ఏరియల్‌ సర్వే అనంతరం వరద నష్టంపై అధికారులతో కేంద్రమంత్రులు చౌహాన్‌, సంజయ్‌ సమీక్ష

ఖమ్మం వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రి పర్యటన
X

కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ నేడు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వరదలతో నష్టపోయిన పంటలను పరిశీలించనున్నారు. ఖమ్మం, మధిర, పాలేరు నియోజకవర్గాల్లో కేంద్ర మంత్రి పర్యటిస్తారు. కూసుమంచి మండలం జుజ్జులారావుపేటలో రైతులతో ముఖాముఖి మాట్లాడుతారు. కేంద్ర మంత్రులు శివరాజ్‌సింగ్‌, బండి సంజయ్‌ ఖమ్మం జిల్లాలో ఏరియల్‌ సర్వే చేపట్టనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షించనున్నారు. సాయంత్రం కోదాడ వరద ప్రాంతాల్లో పర్యటిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్ర మంత్రి చౌహాన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్రమంత్రిఇతో కలిసి వరద ప్రాంతాల్లో నష్టంపై సమీక్ష చేయనున్నారు.

Raju

Raju

Writer
    Next Story