వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం

మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమిస్తూ రేవంత్ సర్కార్ జీవో విడుదల చేసింది.

POCHARAM
X

మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమిస్తూ రేవంత్ సర్కార్ జీవో విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ తరుపున గెలిచి.. కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన విషయం తెలిసిందే. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశారు. అదే విధంగా తెలంగాణ మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్‌రెడ్డిని తెలంగాణ డెయిరీ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా నియమిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

Vamshi

Vamshi

Writer
    Next Story