ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన బొత్స
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ తరుణంలోనే… బొత్సతో ప్రమాణ స్వీకారం చేయించారు శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు.
- By VamshiLoading...
- | 21 Aug 2024 9:32 AM GMT
X
X
వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. మండలి సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషంగా ఉందని బొత్స అన్నారు.
మా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మకం పెట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు. శాసనసభ, శాసన మండలి లో ప్రజల కోసం నిలబడతాం. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చెయ్యాలి. మేము ప్రజల గొంతుక గా సభలో వ్యవహరిస్తాని మాజీ మంత్రి అన్నారు. మూడేళ్లపాటు బొత్స ఎమ్మెల్సీగా కొనసాగనున్నారు.
Vamshi
Writer
Next Story