ఏకగ్రీవంగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఎన్నిక ఏకగ్రీవం ఎన్నుకోనున్నారు.

BOSTA
X

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఎన్నిక ఏకగ్రీవం ఎన్నుకోనున్నారు. తాజాగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన షేక్ షఫీ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నాడు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. అయితే ఎల్లుండి ఎమ్మెల్సీగా బొత్సను ఎన్నికల రిటర్నింగ్ అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఈ ఎన్నికల నుండి ఇప్పటికే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తప్పనుకుంది.

సరైన బలం లేకవడంతోనే టీడీపీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ ఎన్నికలకు వైసీపీ నుండి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయగా.. ఎవరు ఊహించని విధంగా స్వతంత్ర అభ్యర్థి గా షేక్ షఫీ నామినేషన్ వేశారు. దాంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. కానీ పోటీలో టీడీపీ లేకపోవడంతో బొత్స సత్యనారాయణ విజయం ఖాయం అని అందరూ అనుకున్నారు.

Vamshi

Vamshi

Writer
    Next Story