బీజేపీ చేసిన పనులు చెప్పి సభ్యత్వ నమోదు చేయించాలి: సంజయ్‌

నాగోల్‌లో బీజేపీ సభ్యత్వ నమోదుపై సంయుక్త వర్క్‌షాప్‌లో సంజయ్‌ వ్యాఖ్యలు

బీజేపీ చేసిన పనులు చెప్పి సభ్యత్వ నమోదు చేయించాలి: సంజయ్‌
X

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌.. పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్లను గుర్తించవు.వాటి తీరును ఆ పార్టీల కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌ అన్నారు.నాగోల్‌లోబీజేపీ సభ్యత్వ నమోదుపై మోర్చాలు, సెల్స్‌ సంయుక్త ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌నకు సంజయ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ చేసిన పనులు చెప్పి సభ్యత్వ నమోదు చేయించాలన్నారు. గత ప్రభుత్వం 12 మంది ఎస్సీలను కేంద్ర మంత్రులను చేసిది. సభ్యత్వ నమోదు సమయంలో ఎస్సీ మోర్చా సభ్యత్వాలను నమోదు చేయించాలని సూచించారు. ఓబీసీ నేతలను దేశ ప్రధాని చేసింది బీజేపీనే అన్నారు. ప్రతి ఒక్కరికీ బీజేపీ చేసిన పనులు చెప్పి సభ్యత్వ నమోదు చేయించాలి. ప్రధాని మోడీ ప్రభుత్వం ఒక లక్ష్యంతో పని చేస్తున్నదని, 370 ఆర్టికల్‌ రద్దు చేసిన గొప్ప నేత మోడీ అని కొనియాడారు.

రుణమాఫీపై ప్రజల్లో చర్చ జరుగుతున్నదని అందుకే హైడ్రా పేరుతో హైడ్రామా అని విమర్శించారు. ఓవైసీకి రాష్ట్ర ప్రభుత్వం భయపడిందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ ఒక్కటని బీఆర్‌ఎస్‌ ఆరోపిస్తున్నది. ఆ రెండు పార్టీల టార్గెట్‌ బీజేపీనే. ప్రతి కార్యకర్త ప్రజాప్రతినిధి కావాలనే లక్ష్యంతో పనిచేయాలని సంజయ్‌ సూచించారు. బీజేపీ వల్లే కవితకు బెయిల్‌ వచ్చిందని కాంగ్రెస్‌ ఆరోపించడంపై సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యక్తులు, ప్రభుత్వాలు ఇచ్చే సూచనలతో కోర్టులు తీర్పులు, బెయిల్‌ ఇవ్వవు అన్నారు. కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ కలవడం పక్కా అని సంజయ్‌ తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 109 కేసులు పెట్టింది. రెండు సార్లు జైలుకు పంపిందన్నారు. కేసీఆర్‌ కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదని సంజయ్‌ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పదాధికారులు, మోర్చా, సెల్స్‌ రాష్ట్ర , జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.

Raju

Raju

Writer
    Next Story