భరతనాట్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత

ప్రముఖ భరతనాట్యం, కూచిపూడి కళాకారిణి యామినీ కృష్ణమూర్తి వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు.

భరతనాట్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూత
X

ప్రముఖ భరత నాట్యం, కూచిపూడి కళాకరిణి యామినీ కృష్ణమూర్తి కన్నుమూశారు. వయో సంబంధిత అనారోగ్య సమస్యలతో దిల్లీలోని అపోలో ఆస్పత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఏపీలో చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940లో ఆమె జన్మించారు. దేశ, విదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చారు. పద్మశ్రీ, పద్మ భూషణ్‌, పద్మవిభూషణ్‌, సంగీతనాటక అవార్డులు అందుకున్నారు. గతంలో తితిదే ఆస్థాన నర్తకిగానూ సేవలందించారు.

Vamshi

Vamshi

Writer
    Next Story