రేవ్ పార్టీ కేసులో..నటి హేమకు బెయిల్
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన స్పెషల్ కోర్టు
- Byline VamshiLoading...
- | 13 Jun 2024 5:53 AM GMT
X
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన బుల్లి తెర నటి హేమకు బిగ్ రిలీఫ్ లభించింది. బెంగుళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం జూడీషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పన అగ్రహార కారాగారంలో ఉన్నారు. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ లభించలేదని, చాలా రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించామని హేమ తరఫు లాయర్ మహేష్ కిరణ్ శెట్టి వాదించారు. దీంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది. కాగా కొన్ని రోజుల క్రితం బెంగళూరు పోలీసులు జీ ఆర్ ఫామ్హౌస్పై దాడి చేసినప్పుడు నటి హేమ కూడా పట్టుబడింది.
అయితే ఈ వార్త బయటకు రాగానే, హేమ అదే ఫామ్హౌస్ నుండి వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో ద్వారా తాను హైదరాబాద్లో ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేసిందీ సీనియర్ నటి. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత హేమ డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలిందని వార్తలు వచ్చాయి. దీంతో పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారు. హేమను విచారణకు తీసుకెళ్తున్న సమయంలో కూడా తనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. అప్పుడు కూడా తాను బెంగుళూరులో పార్టీకి వెళ్లానని, కానీ పార్టీ అవ్వకముందే అక్కడి నుంచి వచ్చేశానని అన్నారు. పైగా తనకు అసలు ఏ హెల్త్ చెకప్ చేయలేదని ఆరోపించారు. అయినా కూడా పోలీసులు తనను కస్టడీలోకి తీసుకున్నారు.