ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై బాబు ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. నేడు పలువురు కేంద్రమంత్రులతోనూ బాబు భేటీ కానున్నారు.

ప్రధాని మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ
X

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ప్రధాని నరేంద్రమోడీతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు ఏపీకి రావాల్సిన ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు.

అంతకు ముందు బాబు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్‌తో సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు వివిధ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు.ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం, జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం త్వరిత గతిన పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన నిధులు అందించాలని బాబు ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది.ప్రత్యేక హోదాతో పాటు ఆంధ్రప్రదేశ్‌ను రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించాలని ప్రధానిని కోరినట్టు తెలుస్తోంది.

చంద్రబాబు మధ్యాహ్నం కేంద్రమంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌లతో భేటీ కానున్నారు. సాయంత్రం కేంద్ర మంత్రులు మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, హర్దీప్ సింగ్‌ పరీలతోనూ బాబు భేటీ కానున్నారు.

Raju

Raju

Writer
    Next Story