కాంగ్రెస్ హామీల నుంచి మరో యూటర్న్:కేటీఆర్‌

గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఐదు నెలల బకాయిలు చెల్లించాలంటూ ప్రజలను ఒత్తిడి చేయడంపై కేటీఆర్‌ ఆగ్రహం

కాంగ్రెస్ హామీల నుంచి మరో యూటర్న్:కేటీఆర్‌
X

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను నమ్మి ఆ పార్టీని గెలిపించిన ప్రజలను వంచించే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ మొదలు పెట్టిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారరు. గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్ అంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఐదు నెలల బకాయిలు చెల్లించాలంటూ ప్రజలను ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. చాలామంది లబ్ధిదారులను మళ్లీ అప్లికేషన్ పెట్టుకోవాలంటూ...గత ఐదు నెలల బకాయిలను చెల్లించాలంటూ కోరుతున్నారని ఇదీ ఎంత వరకు కరెక్ట్ అని కేటీఆర్ ప్రశ్నించారు. అంటే ఉచిత విద్యుత్ స్కీం ను ఎగొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రభుత్వ చర్యల ద్వారా అర్థమవుతోందని దుయ్యబట్టారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ఇది మరొక యూటర్న్ అంటూ కేటీఆర్ మండిపడ్డారు. కరెంట్ బిల్లులను సోనియాగాంధీ కడుతారు మీరెవరూ కట్టాల్సిన పనిలేదంటూ హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించాలంటూ వేధిస్తున్న అధికారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రజలు గట్టిగా సమాధానం చెప్పాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మోసపూరిత, నయవంచన వైఖరిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.

Raju

Raju

Writer
    Next Story