మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన మరో రైలు

మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఇండోర్-జబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఫ్లాట్‌ఫామ్‌పైకి వెళ్తుండగా రెండు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు.

Train accident
X

మధ్యప్రదేశ్‌లో జబల్‌పూర్ రైల్వే స్టేషన్ వద్ద ఇండోర్-జబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఫ్లాట్‌ఫామ్‌పైకి వెళ్తుండగా రెండు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎటువంటి నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. అందరూ సురక్షితంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇటీవల దేశంలో రైలు ప్రమాదాలు ఎక్కువ పెరగడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికంగా ఉత్తర, మధ్య భారతంలో రైళ్లు పట్టాలు తప్పుతున్నాయి.

అందుకు కారణం ఏమిటని అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. కొందరు ప్రకృతి వైపరీత్యం అంటుంటే మరికొందరు మానవ తప్పిదం అని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రైల్వేలో లోక్ పైలట్ ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం ప్రమాదాలకు కారణంగా చెప్పకోవచ్చును.

Vamshi

Vamshi

Writer
    Next Story