పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పసిడి

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పసిడి పతకం వచ్చింది. శుక్రవారం జరిగిన పురుషుల టీ64 హైజంప్‌ విభాగంలో 2.08మీటర్ల ఎత్తు జంప్‌ చేసి ప్రవీణ్‌ స్వర్ణం గెలిచాడు.

Praveen
X

పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పసిడి పతకం వచ్చింది. శుక్రవారం జరిగిన పురుషుల టీ64 హైజంప్‌ విభాగంలో 2.08మీటర్ల ఎత్తు జంప్‌ చేసి ప్రవీణ్‌ స్వర్ణం గెలిచాడు. దీంతో భారత ఖాతాలో మొత్తం పతకాల సంఖ్య 26కు చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్య పతకాలున్నాయి. ఈ సీజన్‌లో ఇదే అత్యుత్తమ హైజంప్‌ రికార్డు కావడం విశేషం.

కాగా.. పారాలింపిక్స్‌లో ప్రవీణ్‌ వరుసగా రెండో మెడల్స్ సాధించాడు. యూపీ నోయిడాకు చెందిన 21ఏళ్ల అథ్లెట్‌.. 2021లో జరిగిన టోక్యో పారాలింపిక్స్‌లో రజతం సాధించాడు. అతిచిన్న వయసులోనే ఒలింపిక్‌ పతకం సాధించిన పారా అథ్లెట్‌గా అప్పుడు చరిత్ర సృష్టించాడు.

Vamshi

Vamshi

Writer
    Next Story