అద్వానీకి మళ్లీ అస్వస్థత..ఆసుపత్రిలో చేరిక
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణా అద్వానీ అస్వస్థతతో మంగళవారం ఉదయం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.
- By VamshiLoading...
- | 6 Aug 2024 10:07 AM GMT
X
X
బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణా అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో మంగళవారం ఉదయం ఢిల్లీలోని అపోలో ఆసుపత్రిలో ఆయన్ను కుటుంబ సభ్యులు చేర్పించారు. న్యూరాలజీ విభాగంలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు ప్రకటించారు. వృద్దాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలే తప్ప పెద్దగా ఆందోళన పడాల్సింది ఏమీ లేదని వైద్యులు పేర్కొన్నారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వానీ 2002 నుండి 2004 వరకు ఉప ప్రధానిగా. 1999 నుండి 2004 వరకు కేంద్ర హోం శాఖ మంత్రిగా పని చేశారు.
Vamshi
Writer
Next Story