నటి కంగనా షాకింగ్ కామెంట్స్..నన్ను కలవాలనుకుంటే ఆధార్ కార్డు తెచ్చుకోవాలి

హిమాచల్ ప్రదేశ్ మండి ఎంపీగా నటి కంగనా రనౌత్ పై తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు

Kagana ravath
X

ప్రముఖ బాలీవుడ్ నటి మండి ఎంపీ కంగానా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను కలవాలనుకుంటే ఆధార్ కార్డులు తెచ్చుకోవాలని ఆమె షరతు విధించారు. ఈ లోక్ సభ పరిధిలో ప్రజలు వారి సమస్యలు తెలపాలంటే అక్కడి చిరునామా ఉన్నట్లు చూపే ఆధార్ కార్డులు వెంట తెచ్చుకోవాలంటూ చెప్పింది. అలాగే ఏ ఉద్దేశంతో తనను కలిసేందుకు వచ్చారో కూడా ఓ కాగితంపై రాసి తీసుకురావాలని సూచించారు. హిమాచల్ ప్రదేశ్ కు చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. అందువల్ల మండి ప్రాంతం నుంచి వచ్చే వారు ఆధార్ కార్డులు తీసుకురావడం తప్పనిసరి.

నియోజకవర్గ పనులకు సంబంధించిన వివరాలను కూడా కాగితంపై తీసుకురండి. దీనివల్ల మీరు (ప్రజలు) ఎలాంటి ఇబ్బంది పడకుండా ఉంటారు’ అంటూ కంగనా మీడియా సమావేశంలో తెలిపారు. అయితే కంగనా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. తనను కలవాలనుకొనే ప్రజలు ఆధార్ కార్డులు తీసుకురావాల్సిన అవసరం లేదని ఆమెపై పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ తెలిపారు.‘మేం ప్రజలకు ప్రతినిధులం. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను కలవడం మా బాధ్యత. అది చిన్న పని అయినా లేదా పెద్ద పని అయినా లేదా విధాన నిర్ణయమైనా లేదా వ్యక్తిగత పని అయినా అందుకు గుర్తింపు పత్రం చూపాల్సిన అవసరం లేదని విక్రమాదిత్య తేల్చి చెప్పారు

Vamshi

Vamshi

Writer
    Next Story