జమ్ముకశ్మీర్లో ఘోర ప్రమాదం..8 మంది మృతి
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వాహనం లోయలో పడి 8 మంది దుర్మరణం చెందారు.
- By VamshiLoading...
- | 27 July 2024 10:51 AM GMT
X
X
జమ్ముకశ్మీర్లోని అనంత్బాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వాహనం లోయలో పడి 8 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఐదుగురు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. దక్సమ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కిష్త్వార్ నుంచి వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
టాటా సుమో కారుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో యాక్సిడెంట్ జరిగిందన్నారు. కారు అదుపుతప్పి బోల్తా పడి లోయలో పడిపోయిందన్నారు. కాగా.. ఘటనాస్థలిలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇకపోతే, జమ్ముకశ్మీర్ లో ఇటీవల ప్రమాదాలు పెరిగిపోయాయి. రాజౌరీ, రియాసీ జిల్లాల్లో వరుసగా రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు.
Vamshi
Writer
Next Story