ఐస్క్రీమ్ కోన్లో మనిషి వేలు
ముంబైలో షాకింగ్ ఘటన
- Byline VamshiLoading...
- | 13 Jun 2024 9:50 AM GMT
X
ముంబైలోని మలాద్ ప్రాంతంలో ఆన్లైన్ ఐస్క్రీమ్ ఆర్డర్ చేసిన ఓ మహిళకు షాకింగ్ ఘటన ఎదురైంది. ఆ ఐస్క్రిమ్లో తెగిపోయిన వేలు కనిపించడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యింది. వారు ఆర్డర్ పెట్టిన ది యుమ్మో బటర్ స్కాచ్ ఫ్లేవర్ ఐస్ క్రీంలను ఆన్ లైన్ డెలివరీ సంస్థ ఇంటికి డెలివరీ చేసింది. దానిని తినడం ప్రారంభించిన కొద్దిసేపటికి నోటికి ఏదో తగిలినట్టుగా అనిపించింది. వెంటనే పరీక్షించి చూడటంతో కోన్ ఐస్ క్రీంలో 2 అంగులాల మనిషి వేలు బయటపడింది.
దీన్ని చూసి ఖంగుతిన్న ఆ మహిళ దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వేలును ఫోరెన్సిగ్ ల్యాబ్కు పంపారు. ఈ ఘటనపై యుమ్మో ఐస్ క్రీం అనే సంస్థపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వేలును ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. దీనిపై వెంటనే ధర్యాప్తు చేపడతామని, యుమ్మో ఐస్ క్రీం తయారు చేసే ఫ్యాక్టరీని కూడా సందర్శించి తనిఖీలు చేపడతామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.