ఒక్కరోజే 4 అత్యాచారాలు..సిగ్గుతో తల తలదించుకోవాల్సిన పరిస్థితి : హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలపై ఎక్స్ వేదికగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
- By VamshiLoading...
- | 30 July 2024 3:51 PM GMT
X
రాష్ట్రంలో ఈ ఒక్కరోజే 4 అత్యాచారాలు వనస్థలీపురం, ఓయూ పీఎస్, నల్లగొండ జిల్లా శాలిగౌరారం, ట్రావెల్స్ బస్సులో మహిళపై, జరగడం బాధకరమని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. లైంగిక దాడులు గురించి అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కాలేదు. మహిళలకు భద్రతకు చిరునామాగా ఉన్న తెలంగాణలో ఇలాంటి ఘటనలు ఆందోళనకరం..బాధితులకు భరోసా కల్పించాలి కారకులను కఠినంగా శిక్షించాలని అని హరీష్ రావు ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రైం రేటు విపరీతంగా పెరుగుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలం అయ్యాయి.రేవంత్ సర్కార్ 8 నెలల పాలనలో హత్యలు 500, డకాయిటీస్ 60, దోపిడీలు 400, దొంగతనం కేసులు 10 వేలు, రేప్ కేసులు 1800 నమోదైనట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. పోయిన ఒక్క నెలలోనే హైదరాబాద్ నగరంలో 28 మర్డర్లు జరిగాయని తెలుస్తోంది.