మణికొండలో మహిళపై 15 కుక్కలు దాడి
తాజాగా హైదరాబాద్ లోని మణికొండ ప్రాంతంలో ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. ఒంటరిగా వెళ్తున్న మహిళపై ఏకంగా 15 వీధి కుక్కలు దాడి చేశాయి
- By VamshiLoading...
- | 22 Jun 2024 1:02 PM GMT
X
X
హైదరాబాద్ నగరంలో వీధి శునకాలు రెచ్చిపోతున్నాయి. ఒంటరిగా రోడ్డుపై వెళ్లోన్న వారిపై దాడి చేస్తున్నాయి. తాజాగా మణికొండలోని చిత్రపూరి హిల్స్ వద్ద ఓ మహిళపై దాదాపు 15 కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన సంబంధించిన సీసీటీవి వీడియో వైరలవుతుంది. ఈ ప్రాంతంలో చాలా మంది పిల్లలపై కుక్కలు దాడి చేశాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read - 'కల్కి' మూవీ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ అధికారులు మాత్రం ఈ విషయంలో ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదంటూ కాలనీ వాసులు వాపోతున్నారు. అంబర్ పేట్ లో జరిగిన ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం దృష్టించిన సంగతి తెలిసింది. ఆ తరువాత కూడా ఈ తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి
Vamshi
Writer
Next Story