ప్రజాదర్బర్ ప్రారంభించిన మంత్రి లోకేశ్
మంగళగిరి ప్రజల కోసం లోకేశ్ ప్రజాదర్బర్
- Byline VamshiLoading...
- | 15 Jun 2024 5:21 AM GMT
X
X
మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్ ప్రజాదర్బర్ నిర్వహించారు. ఉండవల్లిలోని తన నివాసంలో నియోజకవర్గ ప్రజల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. ఉదయం 8 గంటలకు ఈ కార్యక్రమం చేపట్టున్నారు. వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి లోకేశ్ భారీ మెజార్టీతో గెలుపు పొందారు. దీంతో ఆయనకు చంద్రబాబు క్యాబినెట్లో మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అప్పగించారు.
Vamshi
Writer
Next Story