నీట్‌పై ఈడీ ఎందుకు కేసు నమోదు చేయలేదు ? : వినోద్‌కుమార్

రాష్ట్రాల వారీగా నీట్ పరీక్ష నిర్వహించాలని తమిళనాడులో విద్యార్థులు ధర్నా చేస్తున్నారని.. మనం అదే బాటలో ముందుకు వెళ్దామని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు

Vinodkumar
X

నీట్ పరీక్ష పత్రం లీక్ వ్యవహారంలో ఈడీ ఎందుకు కేసు నమోదు చేయలేదని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ప్రశ్నించారు.హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియ సమావేశంలో మాట్లాడారు. బీహార్, గుజరాత్ నుండి నీట్ పరీక్ష పత్రం లీక్ అయిందని వార్తలు వస్తున్నాయన్నారు. కోట్ల రూపాయలు చేతులు మారితే ఈడీ ఏం చేస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు ఎందుకు కేసు నమోదు చెయ్యలేదని. తెలంగాణ రాష్ట్రం నుండి చాల మంది పిల్లలు నీట్ పరీక్ష రాశారని. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రొపెసర్ లతో మాట్లాడిన..... నీట్ ద్వారా మన రాష్ట్రానికి లాభం జరిగిందా లేదా అన్నది చర్చ చేసినట్లు ఆయన తెలిపారు.

2015 నుండి నీట్ పరీక్ష తెలంగాణ విద్యార్థులు రాస్తున్నారని..15 శాతం మాత్రమే ఆల్ ఇండియా కోటాకి పోతున్నాయని తెలిపారు. నీట్ పరీక్షలో సీటు వచ్చిన వేరే రాష్ట్రాలకు మన పిల్లలు పోవడం లేదని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 25 మెడికల్ కాలేజీలు ఉన్నాయి.. మరికొన్ని మెడికల్ కాలేజీలు వచ్చే అవకాశం ఉన్నదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రిని నేను ఒక్కటే కోరుతున్నా అని.. నీట్ పరీక్షపై మన పిల్లలకు లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా ఎక్స్ పర్ట్ కమిటీ వేయ్యాలని వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు.

Vamshi

Vamshi

Writer
    Next Story