హైకోర్టులో వైసీపీ నేతలకు చుక్కెదురు
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ
- By RajuLoading...
- | 4 Sept 2024 8:02 AM GMT
X
X
వైసీపీ నేతలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసులోనూ ముందస్తు బెయిల్కు నిరాకరించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేవరకు అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని వైసీపీ కోరింది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వవద్దని టీడీపీ తరఫు న్యాయవాదులు కోర్టును కోరారు. దీనిపై మధ్యాహ్నం తర్వాత కోర్టు వెలువరించనున్నది. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ కార్యాలయంపై వందలాదిమంది దాడికి పాల్పడ్డారు. ఈ దాడి కేసులో దేవినేని అవినాష్, నందిగం సురేశ్, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్ నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.
Raju
Writer
Next Story