అర్దరాత్రి బీభత్సం సృష్టించిన కారు

మద్యం మత్తులో కారు నడిపిన బీటెక్‌ విద్యార్థి సాకేత్‌రెడ్డి

అర్దరాత్రి బీభత్సం సృష్టించిన కారు
X

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద అర్దరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో బీటెక్‌ విద్యార్థి సాకేత్‌రెడ్డి తన మిత్రుడితో కలిసి కార్‌ డ్రైవింగ్‌ చేస్తూ ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. జూబ్లీహిల్స్‌ చెక్‌ పోస్ట్‌ నుంచి కృష్ణానగర్‌కు వెళ్లే మార్గంలో కారు అదపు తప్పి ఫుట్‌పాత్‌పైకి చేరుకుని అక్కడున్న టెలిఫోన్‌ స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది.

ప్రమాదంలో కారు డ్రైవ్‌ చేస్తున్న సాకేత్‌రెడ్డితో పాటు అతని మిత్రుడిని స్థానికులు బైటికి తీశారు. అనంతరం పోలీసులు వారికి బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించగా మద్యం మోతాతు 146 పాయింట్లు నమోదైంది. చికిత్స కోసం ఇరువురిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Raju

Raju

Writer
    Next Story