జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడులు..జవాన్ దుర్మరణం

కశ్మీర్‌లో ఆగని ఉగ్రదాడులు.. 3 రోజుల్లోనే 3 ఘటనలు

Trrist Attack
X

జమ్మూకాశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కతువా జిల్లాలోని సార్తాల్ ప్రాంతంలోని పోలీస్ చెక్ పాయింట్ వద్ద ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ జవాన్ వీర మరణం పొందగా.. సైనిక బలగాల ఎదురు కాల్పుల్లో ఓ మిలిటెంట్ హతమయ్యాడు. మరోవైపు దోడా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. 72 గంటల వ్యవధిలో మూడు ఉగ్రదాడులు జరిగాయి. ఆ క్రమంలో భద్రతా బలగాలు అప్రమత్తం కావడంతో ఉగ్రవాదులకు, పోలీసులకు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఈ దాడి గురించి జమ్మూకశ్మీర్ ఏడీజీపీ ఆనంద్ జైన్ వివరాలు తెలిపారు.

మంగళవారం సాయంత్రం కథువా జిల్లా హీరానగర్‌లోని సైదా సుఖల్ గ్రామంలో ఓ ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటన తర్వాత భద్రతా బలగాలు ఓ టెర్రరిస్టును మట్టుబెట్టాయి. ఇది జరిగిన కాసేపటికే దోడాలోని ఛత్తర్‌గాలాలోని 4 రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసుల జాయింట్ చెక్ పోస్ట్‌పై అటాక్ చేశారు. ఈ కాల్పుల్లో ఐదుగురు సైనికులు, ఓ ప్రత్యేక పోలీసు అధికారి గాయపడ్డారు.ఈ దాడులన్నీ ఉగ్ర కదలికలు లేని గ్రామాల్లో జరిగినట్టు పేర్కొన్నారు. మొదటిగా దాడి చేసే ముందు ఉగ్రవాదులు పలు ఇళ్లకు వెళ్లి నీళ్లు అడిగారని, ఈ క్రమంలోనే పౌరులపై కాల్పులకు తెగపడ్డట్టు తెలిపారు. అయితే ఇక్కడ ముగ్గురు పౌరులు మరణించారని పుకార్లు వెలువడగా దానిని ఆనంద్ జైన్ కొట్టి పారేశారు. ఈ ఘటనలో ఓ పౌరుడు మాత్రమే తీవ్రంగా గాయపడ్డాడని, ఎవరూ మృతి చెందలేదని వెల్లడించారు

Vamshi

Vamshi

Writer
    Next Story