వరంగల్‌ జిల్లాలో జంట హత్యల కేసులో నిందితుడు అరెస్టు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్‌ జిల్లాలో జంట హత్యల కేసులో నిందితుడు నాగరాజును అరెస్టు చేసినట్టు డీసీపీ రవీందర్‌ తెలిపారు.

వరంగల్‌ జిల్లాలో జంట హత్యల కేసులో నిందితుడు అరెస్టు
X

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్‌ జిల్లాలో జంట హత్యల కేసులో నిందితుడు నాగరాజును అరెస్టు చేసినట్టు డీసీపీ రవీందర్‌ తెలిపారు. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్‌తండాలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలను డీసీపీ వెల్లడించారు.

ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి దక్కడం లేదనేన హత్యలు చేశాడు. 9వ తరగతి నుంచి దీపిక, మేకల నాగరాజు అలియాస్‌ బన్నీతో పరచయం ఉన్నది. అమ్మాయి మేజర్‌ అయ్యాక ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు.

కొన్ని రోజుల తర్వాత అతనితో ఉండలేనని దీపిక పుట్టింటికి వచ్చింది. దీపి దక్కకకపోవడానికి ఆమె తల్లిదండ్రులు బానోతు శ్రీనివాస్‌, సుగుణ కారణమని వారిపై నాగరాజు కక్ష పెంచుకుని హత్య చేశాడు. అందరినీ చంపేద్దామని గురువారం తెల్లవారుజామున వేట కొడవలి తీసుకొచ్చి యువతి ఇంటికి వెళ్లాడు. బైట నిద్రిస్తున్న శ్రీనివాస్‌, సుగుణలపై విచక్షణరహితంగా దాడి చేసి నరికాడు. తల్లిదండ్రుల అరుపులు విని బైటికి వచ్చిన దీపిక, మదన్‌లాల్‌లై కూడా దాడి చేశాడు. దాడి తర్వాత అడ్డం వచ్చిన వారిని బెదిరించి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడికి ఎవరూ సహకరించలేదు. హత్య జరిగిన తర్వాత పోలీసులు త్వరగా స్పందించారని, చట్టప్రకారం నిందితుడికి శిక్ష పడేలా చూస్తామని డీసీపీ తెలిపారు.

Raju

Raju

Writer
    Next Story