దేవాలయంలో తొక్కిసలాట.. ఏడుగురు భక్తులు మృతి
బీహార్లో జెహనాబాద్లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 7 మంది మృతి చెందగా, 50 మందికి గాయాలయ్యాయి.
- By RajuLoading...
- | 12 Aug 2024 3:02 AM GMT
X
X
బీహార్లోని జెహానాబాద్ జిల్లా మగ్ధుంపూర్లోని బాబా సిద్ధనాథ్ దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. 50 మందికి మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.
అనంతరం మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం తరలించనున్నట్లు చెప్పారు. సంఘటనా స్థలిని జెహానాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ అలంకృత పాండే పరిశీలించారు. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయని తెలిపారు.
Raju
Writer
Next Story