ఎన్ కన్వెనషన్ పట్టాభూమిలోనే నిర్మించాం
అభిమానులు తప్పుడు వార్తలను నమ్మోద్దు : హీరో నాగార్జున
- By Naveen KameraLoading...
- | 25 Aug 2024 1:50 PM GMT
X
X
ఎన్ కన్వెన్షన్ పై వస్తున్న ఎలాంటి నిజాలు లేవని, వాస్తవాల కన్నా ఊహాగానాలే ఎక్కువగా ప్రచారమవుతున్నాయని హీరో నాగార్జున పేర్కొన్నారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు వాటిని నమ్మొద్దని ‘ఎక్స్’ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఎన్ కన్వెన్షన్ నిర్మించిన భూమి పూర్తిగా పట్టా భూమి అని, ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదని తెలిపారు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని ఏపీ స్పెషల్ కోర్టు, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ (ప్రొహిబిషన్) యాక్ట్, 2014 ఫిబ్రవరి 24న తీర్పునిచ్చిందని తెలిపారు. ఆర్డర్ ఎస్ఆర్ 3949/2011 ద్వారా ఈ జడ్జిమెంట్ ఇచ్చారని వెల్లడించారు. ప్రభుత్వ చర్యపై హైకోర్టును ఆశ్రయించామని, న్యాయస్థానం ఇచ్చే తీర్పునకు తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. అప్పటి వరకు ఎలాంటి ఊహాగానాలు, పుకార్లు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.
Naveen Kamera
Writer
Next Story