అమెరికాలో కాల్పులు..బాపట్ల యువకుడు గోపీకృష్ణ మృతి

అమెరికాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఈ కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ మృతి చెందాడు.

అమెరికాలో కాల్పులు..బాపట్ల యువకుడు గోపీకృష్ణ మృతి
X

అమెరికాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఈ కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌ బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ మృతి చెందాడు. రెండు రోజుల కిందట దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గోపీకృష్ణ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అమెరికాలోని ఆర్కెన్సాస్‌లోని సూపర్‌ మార్కెట్‌లో పనిచేస్తుండగా ఈఘటన జరిగింది. మృతుడు గోపీకృష్ణ స్వస్థలం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలి గ్రామం.

Also Read: గాజాలో ఇజ్రాయిల్‌ వైమానిక దాడి.. 39 మంది మృతి

శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్‌లో ఉండగా.. ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతనిపై కాల్పులు జరిపాడు. తీవ్రయగాయాలతో గోపి అక్కడికక్కడే కుప్పకూలిపోగా.. అనంతరం దుండగుడు ఓ వస్తువును తీసుకుని పారిపోయాడు.తర్వాత గోపీకృష్ణను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. ఈ దృష్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న ఆయన కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతిడికి భార్య, కుమారుడు ఉన్నాడు. గోపీ మరణవార్త తెలియడంతో ఆయన స్వగ్రామం యాజలిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Raju

Raju

Writer
    Next Story