ప్రేమ వివాహాన్ని కాదన్నందుకు దంపతుల దారుణ హత్య

ప్రేమ వివాహాన్ని కాదన్నందుకు అమ్మాయి తల్లిదండ్రులను దారుణంగా నరికి చంపాడు. అమ్మాయిని, ఆమె సోదరుడిని చంపేందుకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన వాళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రేమ వివాహాన్ని కాదన్నందుకు దంపతుల దారుణ హత్య
X

వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం 16 చింతల్‌ తండాలో దారుణం చోటుచేసుకున్నది. ప్రేమించానని చెప్పి అమ్మాయిని రహస్యంగా పెండ్లి చేసుకున్నాడు. రెండు నెలలు మాత్రమే కలిసి ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవలు మొదలుకావడంతో పెద్దల సమక్షంలో విడిపోయారు. దీంతో మేకల బన్ని అనే యువకుడు అమ్మాయితో పాటు తల్లిదండ్రులపై కక్ష పెంచుకుని ఉన్మాది మారిపోయాడు.

బానోతు శ్రీను, సుగుణ దంపతుల కూతురు దీపిక గూడురు మండలం గుండెంగికి చెందిన మేకల నాగరాజు అలియాస్‌ బన్ని ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు పెండ్లికి నిరాకరించడంతో గత నవంబర్‌లో ఇంటి నుంచి వెళ్లిపోయి ఎవరికి తెలియకుండా పెండ్లి చేసుకున్నారు. రెండు నెలలు గడిచాక ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో పోలీసులు, పెద్దల సమక్షంలో విడిపోయారు. దీంతో దీపికతోపాటు వారి తల్లిదండ్రులపై నాగరాజు కక్ష పెంచుకున్నాడు. ఇటీవల అమ్మాయికి పెండ్లి సంబంధాలు చూస్తున్నారని సమాచారం తెలుసుకున్న ఉన్మాది అర్దరాత్రి కత్తితో దీపికి ఇంటికి వచ్చిన విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో పొడిచి ఇద్దరినీ హత్య చేశాడు. ఈ దాడిలో అమ్మాయి తల్లి బానోతు సుగుణ అక్కడిక్కడే మృతి చెందింది. తండ్రి శ్రీనివాస్‌ నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు.

ఈ ఘటనలో అమ్మాయితో పాటు ఆమె సోదరుడు మదన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిద్దరనీ ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అర్ధరాత్రి విచక్షణారహితంగా కత్తితో పొడిచి, గొంతు కోసి అమ్మాయి తల్లిదండ్రులను దారుణంగా చంపాడు. దాడి చేసిన అనంతరం అడ్డువచ్చిన వారిని బెదిరించి అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.సంఘటన స్థలానికి చేరుకున్న డాగ్‌స్క్వాడ్‌, క్లూస్‌ టీం విచారణ చేస్తున్నారు. మరోవైపు నిందితుడికి సహకరించాడని అతని మిత్రుడు పవన్‌పై తండా వాసులు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని పవన్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Raju

Raju

Writer
    Next Story