కర్నూల్‌ జిల్లాలో బీజేపీ నేత శేఖన్న దారుణ హత్య

కర్నూల్‌ జిల్లాలో బీజేపీ నేత శేఖన్న దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఇంటి ముందు నిద్రపోతున్న ఆయన గొంతు కోసి చంపారు.

కర్నూల్‌ జిల్లాలో బీజేపీ నేత శేఖన్న దారుణ హత్య
X

కర్నూల్‌ జిల్లాలో బీజేపీ నేత శేఖన్న దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఇంటి ముందు నిద్రపోతున్న ఆయన గొంతు కోసి చంపారు. కర్నూల్‌ జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. శేఖన్న ఇటీవలే వైసీపీ వీడి బీజేపీలో చేరారు.

దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆదోని డీఎస్పీ సోమన్న, తాలూకా సీఐ నల్లప్ప, ఐఎస్‌వీఐ ఎస్సై నాగేంద్ర హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆదోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించాఉ. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Raju

Raju

Writer
    Next Story