ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం..10 మంది మృతి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. రుద్రప్రయాగ్లో ప్రయాణిస్తున్న ఓ టెంపో వాహనం అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయింది.
- By RajuLoading...
- | 15 Jun 2024 12:32 PM GMT
X
X
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. రుద్రప్రయాగ్లో ప్రయాణిస్తున్న ఓ టెంపో వాహనం అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయింది. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే సహాయ, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటన ఉదయం 11 గంటల సమయంలో జరిగి ఉండొచ్చు అని రుద్రప్రయాగ్ విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజ్వార్ తెలిపారు. 18 మందిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలో చేర్చినట్లు సింగ్ చెప్పారు. ఈ వాహనంలో ముగ్గురు సిబ్బందితో సహా 23 మందితో వెళ్తున్న టెంపో రోడ్డుపై నుంచి అలకనంద నదిలో పడిపోయిందని ఆయన తెలిపారు.ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు అవసరమైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
Raju
Writer
Next Story