అబిడ్స్ కిడ్నాప్నకు గురైన బాలిక ఆచూకీ లభ్యం
అబిడ్స్ పరిధిలో కిడ్నాప్నకు గురైన ఆరేళ్ల బాలిక ఆచూకీ లభించింది. కొత్తూరు మండలం ఇనుములనర్వ వద్ద బాలికను పోలీసులు గుర్తించారు.
- By RajuLoading...
- | 4 Aug 2024 5:11 AM GMT
X
అబిడ్స్ పరిధిలో కిడ్నాప్నకు గురైన ఆరేళ్ల బాలిక ఆచూకీ లభించింది. కొత్తూరు మండలం ఇనుములనర్వ వద్ద బాలికను పోలీసులు గుర్తించారు. కిడ్నాప్కు గురైన బాలికను కొత్తూరు నుంచి అబిడ్స్కు తరలించారు. బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాపర్ బీహార్ కు చెందిన బిలాల్గా గుర్తించారు. నిన్న అబిడ్స్లో ఆడుకుంటున్న బాలికను దుండగులు ఆటోలో ఎత్తుకెళ్లారు.
ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. సిటీ నుంచి జహంగీర్ దర్గా.. షాద్నగర్ దాకా వెతికామని తెలిపారు. ముగ్గురు మహిళలం, ఇద్దరు మగవాళ్లు నిన్నటి నుంచి ఇవాళ పొద్దున వరకు పాప కోసం వెతికినట్టు తెలిపారు. చిన్నారి గురించి వారి ఒక్కో స్టేషన్లో వెతుకుతుంటే కిడ్నాపర్ గురించి విస్తుపోయే నిజాలు చెప్పారని తెలిపారు. ఈ ఒక్క పాపనే కాదు పదిహేను మందిని కిడ్నాప్ చేశాడని, సీసీ ఫుటేజ్ను పోలీసులు మాకు చూపెట్టినట్టు బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు వెల్లడించారు.స్టేషన్లో నిందితుడికి బాలిక కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేశారు.చిన్నారిని కిడ్నాప్ చేసిన నిందితుడిని వదిలిపెట్టవద్దని బాధితులు పోలీసులను కోరారు. కిడ్నాప్కు గురైన తమ బాలికను గంటల వ్యవధిలోనే అప్పగించినందుకు పోలీసులకు అభినందనలు తెలిపారు.