నగరంలో కలకలం సృష్టిస్తున్న వరుస హత్యలు

హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నారు. 24 గంటల్లో ఐదు హత్యలు, రెండు హత్యాయత్నాలు వెలుగులోకి రావడం నగర వాసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి.

నగరంలో కలకలం సృష్టిస్తున్న వరుస హత్యలు
X

హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నారు. 24 గంటల్లో ఐదు హత్యలు, రెండు హత్యాయత్నాలు వెలుగులోకి రావడం నగర వాసులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఆర్థిక, అక్రమ సంబంధాలే ప్రధాన కారణాలుగా ఈ ఉదంతాలు చోటు చేసుకున్నాయి. ఓల్డ్‌ సిటీ శాలిబండ పరిధిలో నిమ్రా ఫాస్ట్‌ఫుడ్‌ యజమాని రఫీక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఇదే ప్రాంతంలో వజీద్‌, ఫకృద్దీన్‌లపై హత్యాయత్నం జరిగింది. ఆసీఫ్‌ నగర్‌లో అలీం అనే వ్యక్తిపై కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు. కాచిగూడ స్టేషన్‌ పరిధిలో ఖిజార్‌ అనే హతమార్చి రైల్వే పట్టాలపై మృతదేహాన్ని పడేశారు. సనత్‌ నగర్‌ పరిధిలోని పీఎస్‌ పరిధిలో అజహర్‌ అనే రౌడీషీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. తుకారంగేట్‌ ఠాణా సమీపంలో అడ్డగుట్టలో భార్య రోజాను హత్య చేసి భర్త పరాయ్యాడు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నిఘా లోపాలతోనే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. కొందరు పోలీసుల నిర్లక్ష్యంతోనే ప్రతీకార దాడులు జరుగుతుండటంతో ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

Raju

Raju

Writer
    Next Story